తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనలో చిన్న యాక్సిడెంట్ జరగ్గా ప్రమాదం మాత్రం తప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఈ అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని బురుగుపూడిలో చంద్రబాబు కారును.. మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలావుంటే చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ పేరుతో 3 రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు.
ఈ నెల 15, 16, 17 తేదీల్లో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలి రోజు జగ్గంపేట.. రెండో రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడో రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. మూడు రోజుల పాటు 145 కిలో మీటర్ల పొడవున చంద్రబాబు రోడ్షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. గోకవరంలో ఏర్పాట్లను నెహ్రూ.. వంతల రాజేశ్వరి తదితరులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో బుధవారం గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు పూలు చల్లతూ స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa