తెలుగు గడ్డపై కూడా భూమి కంపించింది. ఏపీలోని ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అలాగే పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో భూమి కంపించింది. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూప్రకంపనలు సంభవించాయి. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ భూప్రకంపనల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. స్వల్పంగానే భూమి కంపించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో ఘటనా స్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ఏపీలో ఇటీవల పలు జిల్లాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa