కోడుమూరు మండలం ప్యాలకుర్తి సాయిబాబా ఆలయం సమీపంలో వాము లోడుతో వెళ్తున్న టాటాఏస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరికి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకుడు కోడుమూరుకు చెందిన పరమేష్ గా గుర్తించారు. మంగళవారం కోడుమూరుకు చెందిన పరమేష్ తన పొలంలో పండించిన వామును కర్నూలు మార్కెట్ కు మిత్రుల సహాయంతో వాహనంలో తరలిస్తుండగా ప్యాలకుర్తి సాయి బాబా ఆలయం సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగిందని బాధితులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa