అనంతపురం జిల్లా ఉరవకొండ శ్రీగవిమఠస్థిత చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుండి మార్చి 3వతేదీ వరకు నిర్వహించనున్నారు. గవిమఠ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లుపై ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయంలో మండల ఆధికారులతో గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర, గవిమఠం సహాయ కమీషనర్ చిట్టెమ్మ, తహశీల్దార్ షాబుద్దీన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటస్వామి, అగ్ని మాపక అధికారి భీమలింగ, ఈఓఆర్డీ దామోదర రెడ్డి, ఆర్అండ్ బీ ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa