అమలాపురం పరిధిలోని కామనగరువు అబ్బిరెడ్డి కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆదిమూలం సాయిబాబు (20) ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అమ లాపురం తాలూకా ఎస్ఐ అందె పరదేశి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబ్కేర్ జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి సాయిసురేష్(28), అదే ప్రాంతానికి చెందిన సాయిబాబు, మహిపాల ప్రేమ్కుమార్, మెర్ల ఆదిగం గరాజు బుధవారంరాత్రి ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో ఓ వివాహ వీడియో చిత్రీకరణకు మోటారు సైకిళ్లపై వచ్చారు. గురువారం ఉదయం సాయి బాబు, సాయిసురేష్ ఒక మోటారు సైకిలుపై కొత్తపేట బయల్దేరారు. కామన గరువు అబ్బిరెడ్డివారి కాలనీవద్దకు వచ్చేసరికి ఎదురుగా అమలాపురం నుంచి ముమ్మిడివరం వెళుతున్న మినీ లారీ బైక్ను ఢీకొట్టింది. గాయపడ్డ సాయిసురేష్, సాయిబాబులను హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయ పడ్డ సాయిబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అద్దంకి సాయిసురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ పరదేశి తెలి పారు. ఇదిలావుుండగా మృతుడు సాయిబాబు తండ్రి గతంలోనే మృతి చెందాడు. చిన్నవాడైనప్పటికీ తల్లి నాగభూలక్ష్మితోపాటు సోదరిని పెంచే బాధ్యతను సాయిబాబు తీసుకున్నాడు. కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న బిడ్డ మృతి చెంద డంతో ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa