రాష్ట్ర ప్రజల కోసమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ పాదయాత్ర చేపట్టడం జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గురువారం , వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి గ్రామం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో నారా లోకేశ పాదయాత్ర మార్చి మొదటి వారంలో మూడు రోజుల పాటుగా సాగుతుందని... మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై యువగళం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోకేశ పాదయాత్రలో పాల్గొనే గ్రామ, బూత లెవల్ కమిటీ సభ్యులు, యువత, అనుబంధ సంఘాలు తమ వివరాలు తెలిపి.. యువగళం బ్యాచగా మండలాల వారీగా గుర్తింపు కార్డులను పొందాలన్నారు. అలాగే తూర్పు రాయల సీమ టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కంచెర్ల శ్రీకాంతకు మొదటి ప్రధాన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ మహితరెడ్డి, టీడీపీ నేతలు పులి సత్యారెడ్డి, కోసూరి చంద్రమౌళి, పీవీ నారాయణ, రమేష్, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa