ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్​ లో జర్మనీ ఛాన్సలర్​ పర్యటన

national |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 03:49 PM

రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శనివారం దిల్లీకి చేరుకున్నారు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్​. ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ఈ పర్యటనలో ఇరుదేశాల వ్యాపార వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరపనున్నారు. కాగా 2021 డిసెంబర్ లో జర్మనీ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారత్ కు రావడం ఇదే తొలిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa