అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ప్రతిభా జూనియర్ కళాశాల మానవత స్వచ్ఛంద సంస్థ రాయచోటి శాఖ ఉపాధ్యక్షులు సంచిపుటల ఖాదర్ బాషా, సెక్రెటరీ రామానాయుడు, చైర్మన్ అరమాటి శివగంగి రెడ్డి ల అధ్యక్షతన ఆదివారం మానవతా సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయచోటి పట్టణానికి చెందిన శ్రీ శ్రీనివాస హాస్పిటల్ వైద్యులు చేవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ రెడ్డి చైతన్య నల్లపల్లి తో పాటు అన్నదాత శెట్టిపల్లి గ్రామం సంబేపల్లి మండలానికి చెందిన పతమేకల సోమశేఖర లు ఆదివారంహాజరయ్యారు.
వీరికి మానవత సభ్యులు శాలువాతో సన్మానించి మానవత మెమొంటో ను అందజేశారు. మానవత జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ రెడ్డి ఆర్థిక సహాయంతో రైతుకు పాతమేకల సోమశేఖర్ కు 5, 116 నగదు ప్రోత్సాహాకం ను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రామచంద్ర రెడ్డి మానవత స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేశారన్నారు. రాయచోటి శాఖ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పది బాడీ ఫ్రీజర్ బాక్స్ లతో పాటు అంబులెన్స్, శాంతి రథం. ద్వారా సేవలు కొనసాగిస్తున్నామన్నారు. అదే విధంగా మన సంస్థ ద్వారా విద్యార్థులకు నైతిక విలువల పై అవగాహన సదస్సు ల తో పాటు మొక్కలు నాటే కార్యక్రమం, ఉచిత మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి విశేషమైన సేవలు అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa