సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో జనసేన పార్టీ కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరాజు సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవలస మండల కేంద్రంతో పాటుగా కొత్తవలస మండలంలో గల ఆయా గ్రామీణ ప్రాంతాల్లో సతీష్ ఆధ్వర్యంలో జనసైనికులు జనసేన పార్టీ కార్యకర్తల్లో అలాగే ప్రజల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తవలస మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సతీష్ సోమవారం మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ఆఖరి తేదీ అని ఆయన తెలిపారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకుని, జనసైనికులు అలాగే వీరమహిళలు భీమాతో దేమాగా ఉండాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa