సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని లక్ష్మణ్ నగర్లో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి ఈకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల నుండి సలహాలు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నిటిని పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
లక్ష్మణ్ నగర్, బేరిపేటలో ఉన్న పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్ గారికి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నానా బాల సుబ్బారావు, తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, తిరుపతి పార్లమెంట్ మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి బిట్రగుంట గీత రెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి నారాయణ, దార్ల రాజేంద్ర, ఇమిడి సెట్టి వెంకటేశ్వర్లు పట్టణ కార్యదర్శి రవి, కార్యనిర్వాహక కార్యదర్శి కొండూరు కృష్ణమూర్తి, రాజు, కిషోర్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు రహమాన్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హైమావతి, సులేమాన్, 14 వ వార్డు అధ్యక్షులు వాకిలివెంకటేశ్వర్లు, బత్తల దినేష్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కాశీ నాగరాజు , తెలుగు యువత నాయకులు జయ ప్రకాష్, దిలీప్ , పట్టణ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పునిత్ సాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa