ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి శ్వాసవరకు పాపాఠాలు చెబుతూనే... కుప్పకూలిన టీచర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 06:12 PM

చివరి శ్వాస వరకు పాఠాలు చెబుతూనే ఓ టీచర్ ప్రాణాలు వదిలిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటుచేసుకొంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయాడు. ఇంకొల్లుకు చెందిన వీరబాబు వాకావారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న వీరబాబుకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. వెంటనే గమనించిన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు.


టీచర్లు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. 108 సిబ్బంది వైద్యం అందించేందుకు ప్రయత్నింగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అప్పటి వరకు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజు కూర్చొని పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు అదే కుర్చీలో ప్రాణాలు విడవడంతో తోటి ఉపాధ్యాయులు జీర్ణించుకోలేక పోతున్నారు. వీరబాబు కుటుంబంలో కూడా విషాద చాయలు అలముకున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa