ప్రభుత్వ ఉద్యోగస్తులు పైన కక్ష తోనే జగన్మోహన్ రెడ్డి ఫేస్ యాప్ అటెండెన్స్ ను అమలు చేస్తున్నాడని అనకాపల్లిమాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. పట్టణం లోనిగవరపాలెంలో ఆదివారం జరిగిన జిల్లా ఆర్ఎంపివైద్యుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి డా వేపాడ చిరంజీవి రావు మాస్టారు ని తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. టీడీపి ప్రభుత్వంలో యువతకు, నిరుద్యోగులను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. టీడీపి అధికారంలోకి రాగానే ఆర్ఎంపి వైద్యుల సమస్యలనూపరిష్కరిస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుసత్యనారాయణ, నారాయణ రావు, కోశాధికారి బుద్ద సోమేశ్వర రావు, అలంకా భోగేష్ , పీలా రామరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa