ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైఎస్సార్సీపీ రెబల్ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా బెయిల్పై విడుదలై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పోలీసులు బనాయించిన గంజాయి కేసులో అన్ని విషయాలూ పది రోజుల్లో బయటపెడతానని చెప్పారు. గంజాయి కేసులో అరెస్టయిన గుప్తా గురువారం ఒంగోలు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. తనకు బెయిల్ కోసం రెండు పార్టీల నాయకులు కృషి చేశారని.. త్వరలోనే తాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలుస్తానని అన్నారు. తనపై జరిగిన కుట్రకు సంబంధించిన సమాచారంతో పది రోజుల్లో అన్ని వివరాలు బహిర్గతం చేస్తానని సుబ్బారావు అంటున్నారు.
ఇటీవల సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గంజాయి కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఒంగోలులోని మంగమ్మ కళాశాల దగ్గర సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించగా.. జైలుకు తరలించారు. గుప్తాకు టీడీపీ వాణిజ్య విభాగం అండగా నిలిచింది.. సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించింది. ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించారు. మొత్తానికి బెయిల్పై విడుదలయ్యారు.
ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా వైఎస్సార్సీపీ కార్యకర్త. అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో సొంత పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో అతడి ఇంటిపై దాడి జరిగింది.. ఆ భయంతో గుప్తా గుంటూరు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఒంగోలు నుంచి సుభానీ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అక్కడికి వెళ్లారు. ఓ గదిలో ఉన్న సుబ్బారావుపై దాడి చేశారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు కూడా నమోదైంది.. సుభానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత గుప్తా వెళ్లి బాలినేని కలడంతో వివాదం సమసిపోయిందని అందరూ భావించారు. ఆ తర్వాత కూడా సుబ్బారావు గుప్తా దూకుడు తగ్గించలేదు.. వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఢిల్లీ వెళ్లి ధర్నాకు దిగారు.. ఎంపీ రఘురామను కూడా కలిశారు. కొద్ది రోజులకు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదన సంగతి తెలిసిందే. ఇప్పుడు గంజాయి కేసులో అరెస్టై బెయిల్పై బయటకు వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa