ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా గుండెను వండుకొని తిన్నాడు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 08:37 PM

కొందరు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఉంటారు. అలాంటి ఘటనే ఇది. నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గుర్ని అత్యంత కిరాతకంగా హత్యచేసిన వ్యక్తికి అమెరికా రాష్ట్రం జీవితఖైదు విధించింది. మహిళను చంపి ఆమె గుండెను బయటకు తీసి.. బంగాళాదుంపలతో కలిసి వండకుతిన్న నరరూప రాక్షసుడికి యావజ్జీవత ఖైదు విధిస్తూ ఓక్లహోమా గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు ది ఇండిపెండెంట్ కథనం తెలిపింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పాల్.. ముందస్తు విడుదల నెలలోపే దారుణాలకు ఒడిగట్టాడు.


జైలు నుంచి విడుదలైన కొద్ది వారాల తర్వాత ఆండ్రియా బ్లాంకెన్‌షిప్ అనే మహిళను దారుణంగా హత్య చేసి గుండెను బయటకు తీశాడు. అనంతరం దానిని మామ, మేనత్త ఇంటికి తీసుకెళ్లి బంగాళాదుంపలతో కలిపి వండాడు. ఈ వంటకాన్ని వారికి వడ్డించే ప్రయత్నం చేయగా.. వారు నిరాకరిచండంతో 67 ఏళ్ల లియోన్ పై, అతడి 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ డాదిలో లియోన్‌పై భార్య తీవ్రంగా గాయపడింది.


డ్రగ్స్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడగా.. మూడు సంవత్సరాల్లోనే సత్ప్రవర్తన ఖైదీగా ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ కమ్యుటేషన్ ఇవ్వడంతో విడుదలయ్యారు. అయితే, సామూహిక కమ్యుటేషన్‌లో భాగంగా పొరపాటున ఆ జాబితాలో పాల్ చేరినట్టు దర్యాప్తులో గుర్తించారు. హత్య, దాడులు వంటి నేరాన్ని అంగీకరించిన అండర్సన్‌కు ఐదు జీవిత ఖైదులను విధిస్తూ గవర్నర్ తీర్పు చెప్పారు. నిందితుడి దాడిలో గాయపడిన మేనత్తతో పాటు ఇతరు బాధిత కుటుంబాలు అండర్సన్‌కు వ్యతిరేకంగా ఓక్లహోమా గవర్నర్, జైలు పెరోల్ బోర్డులో కేసులు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన గవర్నర్.. నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa