ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూ నిర్వహించి... మత్తించి ఆపై అత్యాచారం

international |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 08:37 PM

మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఘటన ఇది. ఉద్యోగాల పేరుతో యువతలను ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తుమందు కలిపిన పానీయాలు తాగించి వారిపై అత్యాచారాలకు పాల్పడిన భారతీయ సంతతికి చెందిన యువకుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్‌ ధన్ఖర్‌.. ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మత్తుమందు కలిపిన డ్రింక్స్‌ తాగించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. వాటిని వీడియో రికార్డింగ్‌ చేసేవాడు. బాధితుల్లో ఎక్కువ మంది కొరియా మహిళలే ఉన్నారు. వాళ్లంటే పడిచచ్చిపోయే బాలేశ్‌.. బాధితుల పేర్లు, వివరాలను దాచుకున్నాడు.


తన గదిలో బెడ్‌ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్‌ కెమెరా ఏర్పాటుచేసి.. అత్యాచారానికి పాల్పడి రికార్డు చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. 2018 జనవరి- అక్టోబరు మధ్య కాలంలో ఏకంగా 13 మందిపై అత్యాచారానికి తెగబడ్డాడు. సిడ్నీ ట్రెయిన్స్, ఏబీసీ, ఫైజర్‌లో డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. 2018 అక్టోబరులో నిందితుడు ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్‌ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్‌ బాటిళ్లు, రేప్‌ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్‌ దొరికింది.


బాలేశ్‌ నేరాలపై న్యూసౌత్‌ వేల్స్‌ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. 13 మంది అత్యాచార బాధితుల్లో ఐదుగురు కొరియన్ మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇచ్చి కొరియన్ మహిళలను టార్గెట్ చేసినట్టు డెయిల్ మెయిల్ కథనం పేర్కొంది. తన ఇంటికి సమీపంలో ఉండే హిల్టన్ హోటల్‌కు బాధితులను రప్పించి, కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి తాగించేవాడు. అనంతరం వారు స్పృహ‌కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి, దానిని రికార్డు చేసేవాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa