‘‘పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి గెలుపుతో బుద్దావెంకన్న బాణాసంచా పేల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... మంచి తీర్పు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. మళ్లీ చంద్రబాబు సీఎం అవడం ఖాయం..ఇందుకు ఈ ఫలితమే నిదర్శనం. రూ. కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీని ఛీ కొట్టారు. అడ్డదారుల్లో విజయం సాధించాలన్న వైసీపీకి మంచి బుద్ది చెప్పారు. 151 సీట్లు ఇస్తే రాక్షస పాలన సాగిస్తున్న జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే 14నెలలు ముందుగానే నీ ఓటమికి బాటలు వేశాడు. ఈ సెమీ ఫైనల్లో ఓడిపోయిన జగన్... ఇప్పుడు అయినా బుద్ది తెచ్చుకోవాలి. కృష్ణా జిల్లాలో టీడీపీ బిక్షతో పెరిగిన కొడాలి నాని, వంశీ, అవినాష్లు మూట ముల్లె సర్దుకుంటున్నారు. విదేశాల్లోకి వెళ్లేందుకు అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్లు ఈ ఫలితాలతో అయినా బుద్ది తెచ్చుకోవాలి. జూన్ నుంచి విశాఖ పాలన అన్న జగన్ను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ నాయకులను అసహ్యించుకుంటున్నారు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa