ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిస్సా నుండి తమిళనాడు భారీగా గంజా తరలింపు, పోలీసులు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 12:08 PM

అనకాపల్లి జిల్లా గోలగొండ మండలం రాజవరానికి చెందిన బోర్ల రాజాబాబు అలియాస్‌ రాజు, బచ్చుపేట మండలం పెదపూడికి చెందిన బొట్ట శివకుమార్‌ అలియాస్‌ శివ, రాజవరానికి చెందిన కొప్పు రాంబాబు, గుండిపూడి పంచాయతీ కొత్తూరు జంక్షన్‌కు చెందిన యేన్నింటి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ దుర్గాలు 170 కేజీల గంజాయిని ఒడిస్సాలో కొనుగోలు చేసుకుని వ్యాను లో తమిళనాడు తరలించేందుకు ఆదివారం రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు చేరుకున్నట్లు పోలీసులు తెలియజేసారు. తమిళనాడు తిరువనమలై జిల్లా అత్తిపట్టు గ్రామం పద్మనాభనగర్‌కు చెందిన ఆర్‌. దినేష్‌కుమార్‌ అనే ఏజెంట్‌తో ఫోనులో మాట్లాడుకొని దివాన్‌చెరువు ప్రూట్‌ మార్కెట్‌ సమీపం లో ఉన్న వాహనంలోంచి దినేష్‌కుమార్‌ 170కేజీల గంజాయిని తన వాహనంలోకి మార్చుకుని తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా బొమ్మూరు పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈసందర్భం గా మొత్తం ఆరుగురిని అరెస్టుచేసి వారివద్ద నుం చి 170 కేజీల గంజాయి, ఒక వ్యాన్‌, కారు, రెండు బైక్‌లు, 9 సెల్‌ఫోన్లు, రూ.3లక్షల 52వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa