ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగ్జీవన్‌రామ్‌కు భారతరత్న ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 12:09 PM

కాకినాడ జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ , జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...  స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉప ప్రధానిగా జగజ్జీవన్‌రామ్‌ దేశానికి ఎనలేని సేవలందించారన్నారు.అంబేడ్కర్‌, బాబూ జగజ్జీవన్‌రామ్‌లు దళితులకు రెండు కళ్ల వంటివారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ రచన ద్వారా హక్కులు కల్పిస్తే, వాటిని రాజ్యాంగం ప్రకారం అమలు చేయించిన ఘనత జగ్జీవన్‌రామ్‌కే దక్కుతుందన్నారు. అసమానతలు తొలగిపోయేంత వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి వాటిని కొనసాగించిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌ రామ్‌ అని ఆయన కొనియాడారు. ఇప్పటికైనా జగ్జీవన్‌రామ్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa