ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్.. 2001లో పదిహేడేళ్ల వయసులో మొదటిసారి గర్భం దాల్చి బిడ్డను ప్రసవించింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, మూడో సంతానంగా పుట్టిన బిడ్డ ఏడు రోజులకే చనిపోయింది.
ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్, తన 8 మంది పిలలతో కలిసి లాస్ వేగాస్లో నివసిస్తోంది. ఇటీవల తన బిడ్డలతో కలిసి కోరా చేసిన ఓ టిక్టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వయసుల వారీగా పిల్లలను వరుసగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. ఉద్దేశపూర్వకంగా తాను ఇంత మంది పిల్లలను కనలేదని కోరా వెల్లడించింది. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు తెలిపింది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు చెప్పింది.
చదువుకున్న రోజుల్లోనే ఆండ్రే డ్యూక్, కోరాల మధ్య ప్రేమ చిగురించింది. ఒకే పాఠశాలలో చదువుకున్న వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2001లో వివాహం కాగా.. . అదే ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చారు కోరా. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా సగటున ఓ బిడ్డను కన్నారు. ఇప్పుడు మొదటి బిడ్డ ఎలిజా వయసు 21. రెండో కుమార్తె షేనా వయసు 20 ఏళ్లు. జాన్ (15), కైరో (15), సయా (14), అవి (13), రోమని (12), తాజ్ (10) పిల్లలు ఉన్నారు. 2004లో పుట్టిన మూడో సంతానం వారం రోజులకే చనిపోయింది.
మాతృత్వం తనకు సహజంగా వచ్చింది.. నా భర్త సహకారంతో అనేక అడ్డంకులను అధిగమించాను అని కోరా తెలిపారు. తన పిల్లలను పరిచయం చేస్తూ పెట్టిన వీడియోపై పలువురు విమర్శలు కూడా గుప్పించారు. వరుగా పదేళ్లలో 9 మందిని ఎలా కన్నావని ప్రశ్నిస్తున్నారు. ‘నా గర్భధారణ సమయంలో నేను దేనిపైనా దృష్టి పెట్టలేదు.. అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపింది.. నేను చిన్న వయసులో ఉండటం అదే నాకు ఓదార్పునిచ్చింది. నాకు ధైర్యాన్ని కూడా ఇచ్చింది.. నేను తరచుగా అనారోగ్యానికి గురయ్యాను... నా కుటుంబం నాకు మద్దతుగా నిలవడం వల్ల నేను ఇది సాధించాను’ అని సమాధానం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa