ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిరోజు రెండు కోడిగుడ్లు ఇవ్వండి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది,,,ఏపీ మంత్రికి స్పెషల్ రిక్వెస్ట్ చేసిన బండ్ల గణేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 02:26 PM

'జగనన్న గోరుముద్ద లో మరో పోషకాహారం.. నేటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ' అందిస్తున్నామని  మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. మంత్రి. బొత్స ట్వీట్‌పై నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పందించారు. 'ప్రతిరోజు రెండు కోడిగుడ్లు ఇవ్వండి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది అన్నయ్య ' అంటూ మంత్రికి సలహా ఇచ్చారు.  బండ్ల గణేష్‌ ట్వీటపై కొందరు నెటిజన్లు స్పందించారు. ఒక మంచి ఐడియా ఇస్తాను..ప్రభుత్వ పాఠశాలలో  ఇచ్చే కోడిగుడ్లు ఉచితంగా ఇవ్వు అన్న,. తొందర్లో శుభవార్త వింటావు అంటూ ఒకరు ట్వీట్ చేశారు. వ్యాపారానికి వ్యాపారం.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని మరొకరు కామెంట్ చేశారు. 'నువ్వు నీ ఫార్మ్ లో ఉన్న గుడ్లు ఉచితంగా సప్లై చెయ్యన్న,  భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వొచ్చు' అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. 'ఆ గుడ్లు కాంట్రాక్ట్ కూడా నువ్వే తీసుకో అన్నా.. మీకు కోళ్ల ఫార్మ్ లు ఉన్నాయి కదా Just Fub' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. పిల్లలకు తిండి.. గణేష్ అన్న వ్యాపారం రెండు ఒకేసారి అవుతాయి కదా గణేష్ అన్న' మరో నెటిజన్ అన్నారు.  నెటిజన్లు సలహా వెనుక కారణం లేకపోలేదు. బండ్ల గణేష్‌కు ఫౌల్ట్రీ వ్యాపారం ఉంది.. అందుకే ఇలా సలహా ఇస్తూ సరదాగా కామెంట్ చేశారు.


మరోవైపు మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్‌ ఓ రూపం తీసుకొచ్చారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్కూళ్లలో సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదనే సీఎం ఆశయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతోంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందిస్తున్నారు.


అంతేకాదు మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగన్ సర్కార్. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందింస్తోంది. మూడు రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని ఇస్తున్నారు. జగనన్న గోరుముద్ద మెనూలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజులు కోడిగుడ్డు.. ఇప్పుడు మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ రాగి జావ పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో ఎంవోయూ చేసుకుంది ప్రభుత్వం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa