ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యాల ఘర్షణ,,,అమెరికా అప్రమత్తం చేసినట్టు మీడియా కథనం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 05:11 PM

గతేడాది సరిహద్దుల్లో చైనా చొరబాటు యత్నంపై భారత్‌ను అమెరికా ముందుగానే అప్రమత్తం చేసిందా..? అందువల్లే ఆ దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందా.? ఇదే విషయంపై అమెరికా మీడియాలో వెలువడిన కథనం గురించి శ్వేతసౌధం ప్రతినిధిని అడిగిన ప్రశ్నలకు ఆసక్తిర సమాధానం ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఘర్షణ చోటుచేసుకోగా.. రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు.


తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద డిసెంబరు 9న జరిగిన ఘర్షణ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారత్‌తో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలిసింది. కాగా, సరిహద్దు వద్ద చైనా సైన్యం చొరబాటుకు సిద్ధంగా ఉందంటూ దేశ మిలిటరీ ముందుగానే భారత్‌కు సమాచారం ఇచ్చిందంటూ అమెరికా మీడియా ఒకటి కథనాన్ని వెలువరించింది. భారత్‌, అమెరికా సైన్యాల మధ్య సహకార విజయానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొంది.


‘అమెరికా ప్రభుత్వం మొదటిసారిగా పీఎల్‌ఏ చొరబాటుకు ముందు చైనా స్థావరాలు, బలగాల గురించి భారతీయ సహచరులకు వివరాలను అందించింది.. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ గురించి గతంలో నివేదించని యుఎస్ ఇంటెలిజెన్స్ సమీక్ష గురించి తెలిసిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.. సమాచారంలో చర్య తీసుకోదగిన శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి.. అమెరికా ఇంతకుముందు భారత సైన్యంతో పంచుకున్న వాటి కంటే మరింత వివరంగా త్వరగా పంపిణీ చేశారు.’ అని పేర్కొంది.


దీనిపై తాజాగా శ్వేతసౌధం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కో-ఆర్డినేటర్ ఫర్ స్ట్రాటజీక్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి జాన్ కెర్బీని ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ‘నేను ఆ విషయాన్ని ధ్రువీకరించలేను’ అని వెల్లడించారు. చైనా (China) ఏకపక్ష చర్యలతో సరిహద్దుల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.


జూన్‌ 15, 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో రెండు దేశాల బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. అప్పటి నుంచి వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ.. పూర్తిస్థాయి‌లో బలగాల ఉపసంహరణ జరగలేదు. ఇరు దేశాలూ వ్యూహాత్మకంగా సైన్యాలను మోహరిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa