ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల‌లో కాల్పులు,,,ఒకరి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 04:58 PM

క‌డ‌ప‌ జిల్లా పులివెందుల‌లో భ‌ర‌త్ కుమార్ యాద‌వ్ అనే వ్యక్తి జ‌రిపిన కాల్పుల్లో.. దిలీప్‌ అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. డ‌బ్బుల విష‌యంలో భ‌ర‌త్ కుమార్ యాద‌వ్‌ దిలీప్‌తో గొడ‌వ‌కు దిగినట్టు తెలుస్తోంది. పులివెందుల పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న‌ జరిగింది. నడి రోడ్డుపై కాల్పులు జరగడంతో.. స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు.


భరత్ జరిపిన కాల్పుల్లో స్పాట్‌లో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని చికిత్స‌ కోసం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి క‌డ‌ప రిమ్స్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ.. దిలీప్ అనే వ్యక్తి మృతిచెందారు. ఇటు కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్.. పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయిన‌ట్లు తెలుస్తోంది. అంతే కాదు.. భరత్ కుమార్ గతంలో రిపోర్ట్‌గా పనిచేసినట్టు ప్రచారం జరుగుతోంది.


కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బంధువు. వివేకా హత్య కేసులో భరత్ యాదవ్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ కేసు ఇంకా ఎటూ తేలకముందే.. ఇప్పుడు కాల్పులు జరగడం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa