నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నెల్లూరులో రైతులను పరామర్శ చేసిన నాటి నుంచి పార్టీలో కష్టాలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. తన మనవలు తనను చరిత్ర హీనుడు అనుకోకుండా వుండాలనే అమరావతికి మద్దతు ఇస్తున్నానన్నారు. అమరావతి రాజధాని నుంచి మట్టి పెళ్ళ కూడా ఎవ్వరూ తీసుకు వెళ్ళలేరని.. అమరావతికి మద్దతుగా నిలిచిన పార్టీలకు సునామీ లాంటి మద్దతు వస్తుందన్నారు. 3 రాజధానులన్న పార్టీ అమరావతి రాజకీయ రథచక్రాల కింద నలిగిపోతుందన్నారు. అమరావతి కోసం నెల్లూరు జిల్లా ఇప్పుడు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా వుందని, ఇప్పటికైనా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోటంరెడ్డి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa