ఎన్నికలకు మూడు నెలల ముందు జనసేన, బీజేపీ పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని భారతీయ జనతా పార్టీ నేత టీ.జీ.వెంకటేశ్ వెల్లడించారు. వైసీపీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొట్లాడాలంటే బీజేపీతో పొత్తు ఉండాలని... బీజేపీతో పొత్తు లేకపోతే పవన్ పోరాడలేరని ఆయన అన్నారు. బీజేపీతో పవన్ కలిసుంటే తమకు కూడా లాభమేనని చెప్పారు. బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు.
భవిష్యత్ కార్యాచరణ గురించి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ మాట్లాడి ఉండొచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఒక్క సారి ఇలాంటి సందేశం ప్రజల్లోకి వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa