ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. సీఎంకి మెగా బైట్కు, గిగా బైట్కు తేడా తెలియదని సెటైర్లు పేల్చారు. జగన్కు పాలన చేతకాదని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు. సలహాదారుల సలహాలు తీసుకోరని.. సలహాదారులంతా ఒకే సామాజికవర్గానికి చెందినోళ్లు ఉన్నారన్నారు.
జనం అటే జగన్కు కక్ష.. అదో రకం సైకో తత్వం అన్నారు బాలయ్య. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైఎస్సార్సీపీ కుట్ర అన్నారు. తాను సైకాలజీ చదవలేదు కానీ.. తాను పెద్ద సైకాలజిస్ట్ అంటూ కామెంట్ చేశారు. కులాల ఉచ్చులో పడొద్దని.. టీడీపీని గెలిపించుకుందాం, లేకుంటే ఓటే వేటు అవుతుందన్నారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు జనాలకు ఇవ్వలేదని.. ఇప్పుడు ఇచ్చినా తీసుకోవద్దన్నారు. టిడ్కో ఇళ్లు కూలిపోయి జనాలు చనిపోతారని.. మెయింటనెన్స్ లేక ఇళ్లు పాడయ్యాయి అన్నారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అన్ని వర్గాలు లోకేష్కు మద్దతుగా తరలి వస్తున్నారన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కళ్లు తెరవాలని.. భవిష్యత్ కోసం ఓటునే ఆయుధంగా చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.. నాలుగేళ్లవుతోంది ఏమైంది. అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని.. పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని.. ప్రజలు వలస వెళుతున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారని.. ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారని విమర్శించారు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయన్నారు. అమరావతి ఊసు లేదని.. రాజధాని కోసం భూమిలిచ్చిన రైతులు ఉద్యమం చేస్తే అడ్డుకోవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు.
నవరత్నాల పథకాల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని విమర్శించారు.. ఆ అప్పులు ప్రజలే తీర్చాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ ఛార్జీలు పెంచుతారని.. ఏపీ పరిస్థితి మరో శ్రీలంక అవుతుందని.. ఆర్థిక సంక్షోభం వస్తుందన్నారు. ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రావాలని.. ఓటనే ఆయుధం విలువ తెలుసుకోవాలన్నారు. మొన్నటి వరకు జనాలు బయటకు రావడానికి భయపడ్డారని.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్కూ తెలుసన్నారు. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa