ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ మధ్యలో స్కైవాక్ ప్లానింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 08:40 PM

సమీప భవిష్యత్తులో తిరుపతి నగర రూపురేఖలు మారనున్నది.  ఈ క్రమంలోనే తిరుపతి బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్‌కు నేరుగా చేరుకునేందుకు స్కైవాక్‌ నిర్మించనున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ స్థానంలో ఇంట్రా మోడల్‌ బస్టాండ్‌కు డిజైన్ల రూపకల్పన, డీపీఆర్‌ తయారవుతోంది. తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్టాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీతో కలిసి అభివృద్ధి చేసేందుకు ఎంవోయూ చేసుకున్నారు. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్‌, డిపోనకు కలిపి 13 ఎకరాలు స్థలం ఉంటే.. అందులో కొంత భాగంలో బస్టాండ్‌ నిర్మించనున్నారు. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ నిధులు వెచ్చిస్తుండగా.. మిగిలిన స్థలాన్ని టెండర్ల ద్వారా లీజుకు ఇస్తారు. ఇలా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌‌లకు దక్కుతాయి.


ఈ బస్టాండ్‌ డిజైన్‌ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆర్టీసీ భావిస్తోంది. 100 ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికులకు వసతులు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఆర్టీసీ కార్యాలయాలు.. ఆపై అంతస్తుల్లో కమర్షియల్ అవసరాల కోసం నిర్మాణాలు చేపడతారు. తిరుపతి మాత్రమే కాకుండా విశాఖపట్నం మద్దిలపాలెం, విజయవాడ ఆటోనగర్‌, కర్నూలు రాజ్‌విహార్‌ బస్టాండ్లను ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్లుగా అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ (హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌).. దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలున్న చోట్ల భక్తులకు వసతులు కల్పించేలా బస్టాండ్ల అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది.


మరోవైపు సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్‌ నడుస్తోంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైలు ప్రారంభంకాగా.. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి చేరుకున్న ఈ రైలు.. ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం మొట్ట మొదటి ప్రయాణికులతో వెళ్లగా.. ఈ రైలు నడిపిన లోకోపైలెట్లలో రేణిగుంటకు చెందిన మస్తానయ్య ఉన్నారు. స్థానిక పాంచాలీనగర్‌కు చెందిన ఆయన.. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదివారు. ఆదివారం తిరుపతిలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఆయన్ను సత్కరించార.


అంతేకాదు ఆదివారం తిరుపతి- సికింద్రాబాద్‌ వందేభారత్ రైలులో టికెట్‌ చెకింగ్‌కు సంబంధించి అందరూ మహిళలే విధులు నిర్వర్తించడం కూడా విశేషం. ఇలా మహిళలను పూర్తిగా రైలుకు వినియోగించడం సికింద్రాబాద్‌ జోన్‌లో మొదటిసారని చెబుతున్నారు అధికారులు. విధులకు సంబంధించి తగిన సూచనలు చేశామన్నారు. ఇక వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పరుగులు పెడుతోంది.


ఇక సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ కేవలం 8.30 గంటల్లోనే వెళుతుంది. ఈ రైల్లో మెుత్తం 8 కోచ్‌లు ఉండగా.. సీటింగ్ కెపాసిటీ 530. 7 చైర్ కార్ కోచ్‌లు, ఒకటి ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జీ రూ.1680.. ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ రూ.3080. తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ రూ.1625 .. ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ రూ.3030.వారానికి ఆరు రోజులు మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉంటుంది.. మంగళవారం ఒక్కరోజు మెయింటనెన్స్ కోసం ఆపుతారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa