లాభనష్టాలు చూ డకుండా విశాఖ స్టీల్ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వమే నడపాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో లాభనష్టాలు చూడకుండా విశాఖ స్టీల్ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారని.. కానీ, బిడ్డింగ్లో పాల్గొనే అంశంపై ఆ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అసలు ప్రైవేటీకరించడానికి వీల్లేదు అనేదే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు. తమ పార్టీ స్టాండ్ ఇది అయినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను తామెందుకు కొంటామని ప్రశ్నించారు.
ఇక, బీఆర్ఎస్ వాళ్లు కొంటున్నామని బిడ్ వేస్తున్నారంటే వాళ్ల స్టాండ్ ఏంటని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి వీల్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారన్నప్పుడు.. మళ్లీ వాళ్లే కొంటామని అనడం ఎందుకని నిలదీశారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయమనేనా వారి ఉద్దేశం అని ప్రశ్నించారు. అయినా, విశాఖ స్టీల్ ప్లాంట్పై మీడియాలో వస్తున్న వార్తలు తప్ప.. ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి గానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ అధికారిక ప్రకటన ఏదీ వినలేదన్నారు. వాళ్ల స్టాండ్ ఏంటో పూర్తిగా క్లారిటీ రావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటో తెలియకుండా తానేమీ మాట్లాడలేనని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa