ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎంత కీలకంగా పనిచేస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడో ఏడాది కూడా సత్కరించాలని నిర్ణయం తీసుకుంది.. మొత్తం 2లక్షల 33వేల 719 మంది వాలంటీర్లను ఈ ఏడాది సత్కరించనున్నారు. ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నెల పాటూ సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2020–21లో 2021 ఏప్రిల్ 14న వాలంటీర్ల సత్కారం నిర్వహించారు. 2022 ఏప్రిల్ 7 నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఈ ఏడాది ఉగాది సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నెల 14 నుంచి వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గౌరవ వేతనంతో సేవలు అందిస్తున్నా వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. కనీసం ఏడాదిపాటు వాలంటీర్గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని వారిని సత్కరిస్తారు.
ఏపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం అందజేస్తారు. వారికి రూ.30 వేల నగదు, బ్యాడ్జి, మెడల్, శాలువా, సర్టిఫికెట్తో సత్కరిస్తారు. అలాగే ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవార్డు అందజేస్తారు. ఈ కేటగిరీ కింద రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేస్తారు. ‘సేవావిుత్ర’ పురస్కారం కింద 2,28,624 మందికి రూ.10 వేల నగదు అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa