మహారాష్ట్రలో తీవ్ర విషాధం చోటు చేసుకొంది. ఈదురు గాలులకు ఆలయ ప్రాంగణంలోని భారీ వేప చెట్టు కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. విషాదకర ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పరాస్ పట్టణంలోని ఓ ఆలయం వద్ద ఆదివారం వేడుక జరుగుతున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయం పక్కన ఉన్న షెడ్లో భక్తులు తలదాచుకున్నారు. ఈ సమయంలో దాని పక్కనే ఉన్న పురాతన వేప చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో షెడ్డులో 30 నుంచి 40 మంది వరకూ చిక్కుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 నుంచి 40 మంది షెడ్డు కింద చిక్కుకుపోగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఐదుగుర్ని అకోలా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో చెట్టును పైకి లేపి షెడ్డులోని శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీశారు.
దుర్ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని తెలిపారు. ‘అకోలా జిల్లా పరాస్ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆధ్యాత్మిక వేడుక జరుగుతుండగా ఈదురు గాలులకు వేపచెట్టు కూలి భక్తులు చనిపోవడం బాధాకరం.. మృతుల హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.. జిల్లా కలెక్టర్, ఎస్పీలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.. స్వల్పంగా గాయపడినవారికి బాలాపూర్లో చికిత్ జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa