ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆశ్చర్యకరమై కారణంతో.... సచివాలయ ఉద్యోగి సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 06:19 PM

నిర్లక్ష్యపు సమాధానంతో ఉద్యోగం పోగొట్టుకొన్నాడు ఓ సచివాలయ ఉద్యోగి. ఇదిలావుంటే తిరుపతి నగరపాలక కమిషనర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే కమిషనర్ తొలిరోజే రంగంలోకి దిగారు.. అధికారులతో సమీక్ష చేశారు. ఈ క్రమంలో ఓ వార్డు సచివాలయ ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. కమిషనర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.. పరిష్కారం కాని సమస్యలపై సచివాలయ ఉద్యోగులతో సమీక్ష చేశారు. ఈ క్రమంలో ఒకటో డివిజన్‌ పరిధిలోని తిరుమలరెడ్డి సచివాలయ వీఆర్వో ప్రసాద్‌ యూనిఫాం లేకుండా సమీక్షకు హాజరయ్యారు.


అయితే సచివాలయ ఉద్యోగులందరూ యూనిఫాంలో వస్తే.. ఒక్కడివే యూనిఫాంలో ఎందుకు రాలేదని వీఆర్వోను కమిషనర్‌ హరిత ప్రశ్నించారు. తన యూనిఫాంను ఎలుకలు కొరికేశాయని ప్రసాద్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇటు రీసర్వేలో కూడా వెనుకంజలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీంతో వెంటనే వీఆర్వోను సస్పెన్షన్‌ చేయాలని అధికారుల్ని కమిషనర్‌ ఆదేశించారు. వెంటనే సమీప ప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ బాధ్యతల్ని సమీపంలో ఉన్న సచివాలయ వీఆర్వోకు బాధ్యతలు అప్పగించారు.


హరిత గత శనివారం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతిపై తనకు పూర్తి అవగాహన ఉందని.. భవిష్యత్‌‌లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రజావసరాలకే తొలి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ రోడ్లను సకాలంలో పూర్తి చేయిస్తామన్నారు.


మరోవైపు కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది.. అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించగా.. మొత్తం 127 వినతులు వచ్చాయి. రెవెన్యూ విభాగానికి సంబంధించి 96 అర్జీలు, పోలీసుశాఖ-9, పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి ఆరు సమస్యలు విన్నవించారు. మరోవైపు ఓ వ్యక్తి తన పింఛన్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కారు లేకపోయినా ఉన్నట్లు చూపించి తన పింఛన్‌ను రద్దు చేశారని మంగళంకు చెందిన జగన్నాథం అంటున్నారు.


ఆయన స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పది నెలల క్రితం వరకు పింఛన్‌ వచ్చిందని.. ఆ డబ్బుల ఆధారంగానే కుటుంబం నడుస్తోందన్నారు. తన కుమారుడు కూడా అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కారు లేదని ఆర్టీవో అధికారులు ధ్రువీకరించారని.. కానీ సచివాలయ సిబ్బంది మాత్రం పింఛన్‌ పునరుద్ధరించడం లేదన్నారు. అందుకే ఫిర్యాదు చేసేందుకు వచ్చానన్నారు. తాను అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నానని.. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదన్నారు. అధికారులు ఈ సమస్యపై స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa