చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు.. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికి వెళ్లి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు గత ఐదేళ్లలో ఏం చేశాడో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యముందా.. కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని, రూ.1.50 లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్నే మా భవిష్యత్ అని ప్రజలు బలంగా చెప్తున్నారని.. దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా జగనన్న ప్రజాసర్వే చేస్తున్నారన్నారు. మంచి పరిపాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఉంటుందన్నారు.
సీఎం జగన్ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసొచ్చినా వైఎస్సార్సీపీని ఓడించలేరన్నారు. ప్రజలు 2024లో కూడా జగనన్న వన్స్ మోర్ అంటున్నారని.. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల కంటే గొప్పగా పాలనను అందిస్తున్నారన్నారు. అలాంటి సీఎం జగన్పై కుట్రలు, నీతిలేని రాజకీయాలు చేయాలని చూస్తే టీడీపీ, జనసేన పార్టీలను తరిమి కొడతామన్నారు. వైఎస్సార్సీపీ నేతలతో మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని.. చెడుకు పోతే చెడుగా ఉంటుందన్నారు.
వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను చంద్రబాబు మహిళా పార్లమెంట్కు పిలిచి.. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానించారన్నారు. మాచర్లలో పోలీసులతో అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్లో వదిలేశారని.. ఇప్పుడు టీడీపీ కుళ్లుకునేలా అదే పోలీసుల సెక్యూరిటీతో మాచర్లకు వచ్చానన్నారు. తనను పోలీస్ సెక్యూరిటీతో మంత్రిని చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వెంట నడిచిన సైనికుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు రోజా. తమలాంటి నాయకులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి జగన్కు అండగా నిలిచారని.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారన్నారు.
మంత్రి రోజా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం సందర్బంగా మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎడ్ల బండలాగుడు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంతకముందు రోజా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీ విజయవిహార్ గెస్ట్హౌస్లో ఆగరు. మధ్యాహ్నం వచ్చిన ఆమె కాసేపు విశ్రాంతి తీసుకుని మంత్రి రోజా మాచర్లకు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో రోజాను గుర్తించిన స్థానిక మహిళలు, యువకులు సెల్ఫీలు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa