కడపజిల్లా రాజాంపేట వైసీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇదిలావుంటే ఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు ప్రజా సర్వే చేస్తున్నారు.. స్టిక్లర్లు అంటిస్తున్నారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఓ వైపు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ కార్యక్రమం సాగుతుంటే.. సీఎం జగన్ సొంత జిల్లాలో మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేపై అసమ్మతి మొదలైంది. స్థానిక శాసనసభ్యుడిపై సొంత పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించడం చర్చనీయాంశమైంది.
ఉమ్మడి కడప జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ వాళ్లే పోస్టర్లు అంటించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉండే అసమ్మతి నేతలు. రాజంపేటలోని ప్రధాన ప్రాంతాల్లో పోస్టర్లు అంటించడం అధికారపార్టీలో కలకలంరేపుతోంది. ఆ పోస్టర్లలో 'మా నమ్మకం నువ్వే జగనన్న.. కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మీద మాకు నమ్మకం లేదు. ఇట్లు మోసపోయిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు' అంటూ పోస్టర్లు ముద్రించి గోడలకు అంటించారు.
కొద్దిరోజులుగా రాజంపేట ఎమ్మెల్యే మేడాపై అసమ్మతి వర్గం గుర్రుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కొందరు నేతలు ఓపెన్గానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరుగుతుండటంతో ఇలా పోస్టర్లతో తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్ల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa