రాజాం నియోజకవర్గం రాజాం పట్టణంలో గల డోలపేట వార్డ్ పరిధిలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను నేరుగా కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నయ్యా లేదా అని రాజాం ఎమ్మెల్యే జోగులు అడిగి తెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతీ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందుతుందని అన్నారు. ఈ ప్రభుత్వములో పొందినంత లబ్ది ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వములో పొంద లేదని వార్డ్ ప్రజలు పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్లీ. మళ్లీ జగనన్న నాయకత్వంలో రాజాం ఎమ్మెల్యే కంబాల. జోగులు మళ్ళీ రాజాం నియోజకవర్గం శాసనసభ్యులు గా అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ప్రజలు వారి స్పందనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీ, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa