తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ రూ. కోటిరూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందజేశారు ప్రసాద్, ఆంజేనయ ప్రసాద్. మరోవైపు అనంతపురంకు చెందిన శ్రీధర్ దంపతులు టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డీడీని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మా రెడ్డికి అందజేశారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. వీకెండ్తో పాటూ విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ పెరిగింది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి., ప్రముఖ నటుడు అశ్విన్ బాబు., టీటీడీ పాలకమండలి ఎక్స్ ఆఫీసియో సభ్యులు., ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa