గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను ప్రయాగ్రాజ్లో కాల్చి చంపిన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఈ సంఘటనతో ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా పతనమయ్యాయని ఆరోపించారు. మన ప్రజాస్వామ్యంలో ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు స్థానం లేదని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
'ఉత్తరప్రదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలుతున్నాయి. పోలీసులు, మీడియా ముందే అతిక్ను కాల్చి చంపడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. పోలీసులు, మీడియాను చూసి కూడా నేరస్తులు భయపడలేదు. ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు మన దేశంలో చోటు లేదు' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో.. అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అసద్ హతమైన రెండ్రోజుల తర్వాత అతిక్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను ప్రయాగ్రాజ్లో వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా చంపేశారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో, ఉమేష్ పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నారు. అయితే.. ఆయన్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa