ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారిగా గుర్తింపు పొందాలనే అతీక్, అష్రఫ్ లను హత్యచేశాం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 10:00 PM

అతీక్, అష్రఫ్ లను హత్యకసులో నింధితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఓ కేసులో అతీక్, అష్రఫ్ లను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకురాగా, పాత్రికేయుల్లా వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది.   ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ రక్తపుమడుగులో కూలిపోయి అక్కడిక్కడే మరణించారు. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లావ్లేష్ తివారీ, మోహిత్ (సన్నీ), అరుణ్ మౌర్య అని గుర్తించారు. తాము ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే అతీక్, అష్రఫ్ లను చంపేశామని ఆ ముగ్గురు వెల్లడించారు. 


రాష్ట్రవ్యాప్తంగా తమకు పేరొస్తుందని, భవిష్యత్తులో అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని భావించామని తెలిపారు. అతీక్, అష్రఫ్ లను పోలీసు కస్టడీకి అప్పగించినట్టు తెలిసిందని, దాంతో వారిద్దరి హత్యకు ప్రణాళిక రచించామని వివరించారు. జర్నలిస్టుల్లా వచ్చి కాల్పులు జరిపామని, ఈ ఘటన తర్వాత పారిపోవాలని తాము భావించలేదని వెల్లడించారు. ఈ మేరకు నిందితులు చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa