ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగమ్మ జాతర తేదీలను ప్రకటించిన ధర్మకర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 12:45 PM

మే నెల 16, 17 తేదీల్లో  చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్టు ఉత్సవ నిర్వాహక వంశపారంపర్య ధర్మకర్త సీకే తెలిపారు. చిత్తూరులోని పొన్నియమ్మగుడిలో అయన మాట్లాడుతూ.... మే 9వ తేదీన గంగజాతర నిర్వహణకు చాటింపు వేస్తామన్నారు. మే 16న అమ్మవారికి పూజలు నిర్వహించి తెర తొలగింపు అంబలి నిర్వహించనున్నామని, 17న అమ్మవారిని అత్యంత వేడుకగా ఊరేగించి కట్టమంచి చెరువులో నిమజ్జనం చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. జాతర సంభందించి గోడపత్రికలను విడుదల చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa