ఈ నెల 23వ తేదీన జరిగే శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్స వంలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా జీవీఎంఎసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం ఆయన జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన చాంబర్లో సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రినాథరావు, జివిఎంసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూప దర్శనానికి వేలాదిగా భక్తులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్తు, పార్కింగ్, తదితర పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులకు దాతలు అందించే ప్రసాదాలు, ఇతర పానీయాలు యొక్క వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బంది చే తొలగించాలని, దర్శనానికి వచ్చే భక్తులతో పాటు క్యూలైన్లో ఉన్న భక్తులకు సమృద్ధిగా త్రాగునీరు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి భక్తులకు ఇబ్బంది లేకుండా వారు సులువుగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా నగరంలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున స్వాగత బ్యానర్లు, ప్రచార బ్యానర్లు క్లాత్ బ్యానర్లే వాడే విధంగా చూడాలన్నారు. అలాగే దాతలు, భక్తులు పంపిణీ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు, ప్లాస్టిక్ వస్తువులతో కాకుండా పేపర్ ప్లేట్ల తో అందించే విధంగా ఉండేటట్టు వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో , జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు , పట్టణ ప్రణాళిక అధికారి సునీత, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాల రావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa