ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్పర్ధలతో ప్రియురాలని చంపి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 12:57 PM

చిత్తూరులో దారుణం జరిగింది. మనస్పర్ధలతో ప్రియురాలని చంపి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు మరణం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్ళితే... చిత్తూరు నగరానికి  చెందిన దుర్గ (23) ఎం.ఫార్మసీ చేసి.. ఆరు నెలలుగా కొండమిట్టలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. దుబాయ్‌లో వంట మనిషిగా ఉన్న.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కొత్తగూడేనికి చెందిన చక్రవర్తి(27)కి ఫేస్‌బుక్‌లో దుర్గ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. దుబాయ్‌ నుంచి వచ్చేసిన అతడు.. తల్లితో కలిసి రెండు నెలలుగా చిత్తూరులో బ్రెడ్‌ ఆమ్లెట్‌ దుకాణాన్ని నడుపుతున్నాడు. తరచూ దుర్గను కలిసేవాడు. ఆమె, అతడి తల్లులు కలిసి సోమవారం కాణిపాక ఆలయానికి కూడా వెళ్లారు. ఆ తర్వాత పొరపొచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బ్యూటీపార్లర్‌కు చక్రవర్తి వచ్చాడు.లోపల ఏం జరిగిందో .. సాయంత్రం 4 గంటలకు దుర్గ తల్లి వచ్చి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు. ఆమె సమాచారంతో డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితుల్ని పరిశీలించారు. అప్పటికే దుర్గ మృతి చెందగా, చక్రవర్తి కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించారు. చక్రవర్తిని చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎస్పీ రిషాంత్‌రెడ్డి చక్రవర్తిని పరిశీలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. దుర్గ మృతదేహాన్ని చిత్తూరులో పోస్టుమార్టం కోసం తరలించారు. దుర్గ శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోగా చక్రవర్తి గొంతు, చెయ్యి బ్లేడ్‌తో కోసుకుని ఉన్నాడు. దీన్ని బట్టి ఆమెను గొంతునులిమి చంపి, తర్వాత ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.చక్రవర్తి స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదని, పోస్టుమార్గం రిపోర్టు ఆధారంగా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎస్పీ రిషాంత్‌రెడ్డి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa