నరసరావుపేట: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ నెల25 మంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారని పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందన్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం లో టిడిపి అధినేత పర్యటిస్తారని తెలిపారు. ఒక్కోరోజు ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొంటారు. అలాగే ఆయా నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే సభల్లో కూడా ఆయన ప్రసంగిస్తారు. రాత్రి బస ఆయా ప్రాంతంలోనే చేస్తారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లపై నాయకులు దృష్టి సారించారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసే దిశగా పార్టీ క్యాడర్ సమాయత్తమవుతున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa