గాజువాక నియోజకవర్గం 70 వార్డులో కార్పొరేటర్ ఉరుకూటి చందు ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , గాజువాక ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మరియు సంక్షేమ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని స్వయంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి 70 వార్డులో ప్రజలు అపూర్వమైన స్పందనతో బ్రహ్మ రధం పట్టి వారి మద్దతు జగన్ కి ప్రకటించడం పట్ల వైవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు ఉరుకూటి అప్పారావు , గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ తిప్పలు దేవన్ రెడ్డి , కార్పొరేటర్లు రాజన రామారావు, కేబుల్ మూర్తి, పీవీ సురేష్, భూపతి రాజు సుజాత, జోనల్ కమిషనర్ సింహాచలం, డిసిఎంయస్ చైర్మన్ పల్లా చినతల్లి, కన్వీనర్లు, గృహసారధులు, జివిఎంసి మరియు సచివాలయం సిబ్బంది, డ్వాక్రా ఆర్పీ లు, వాలంటీర్లు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa