బీజేపీని గద్దెదింపి దేశాన్ని కాపాడుకుందామని నెల్లూరు జిల్లా, సీఐటీయూ బుచ్చిరెడ్డిపాళెం మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున అన్నారు. ప్రచారభేరిలో భాగంగా 3వరోజు మంగళవారం బుచ్చి పట్టణంతో పాటు మండలంలోని నాగమాంబాపురం, విలియమ్స్పేట, వడ్డిపాళెం, కొండూరుపాళెం, ఇసుకపాళెం, పల్లాపల్లి, అంబేడ్కర్నగర్, చెల్లాయపాళెం, అమ్మోరుతోపు, ప్రగతినగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉన్న బీజేపీ నాడు మేధావులు తయారు చేసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ సొంత మనువాద చట్టాన్ని ప్రజలమీద ప్రయోగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. మేడే రోజున నెల్లూరులో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లావ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు, మల్లికార్జున, సురేష్, మునుస్వామి, అంకయ్య, .జానీభాష, తదితదరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa