ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఉక్కు ప్రయివీటికరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 08:16 PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు పెందుర్తి మండలపరిధిలోని జీవీఎంసీ 94వ వార్డు వేపగుంటలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు=ఆంద్రుల హక్కు అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసరావు, సీపీఎం డివిజన్ సెక్రెటరీ బి. రమణి మాట్లాడుతూ గడిచిన 810 రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఎలాగైనా అమ్మేస్తాం అని నిస్సిగ్గుగా వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా ఏమి అనలేని, మాట్లాడలేని స్థితిలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవాచేసారు. కేవలం తన కేసులు నుండి బయట పడడం కోసమే జగన్ బిజేపీకి దాసోహమయ్యారని ఆరోపించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని, స్వంత ఘనులు కేటాయించాలని, వర్కింగ్ కేపిటల్ ఇచ్చి ఉక్కు ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వై. రాంబాబు, సభ్యులు నారాయణరావు, రామారావు, అరుణ, సీపీఎం జోన్ నాయకులు అప్పలనాయుడు, రజినీ వామపక్షశ్రేణులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa