డిగ్రీదాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన,వసతి దీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారని చెప్పారు. అందుకే వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు కనీసం పదో తరగతి అర్హత పెట్టామన్నారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ నూతన జంటలతో వర్చువల్గా మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa