బంగారం, వెండి ధరలు తాజాగా శనివారం కూడా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. అటు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలోపై రూ.1,150 వరకు ఎగబాకింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.83,700 పలుకుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa