రాజాం నియోజకవర్గం లోని రేగిడి ఆముదాలవలస మండల కేంద్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో బోర్వెల్ స్పేర్ పార్ట్స్ వచ్చినట్లు ఎంపీడీవో గన్నవరపు కాశి విశ్వనాధరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ శ్రీ చరణ్ శనివారం తెలిపారు. రేగిడి ఆమదాలవలస మండలంలోని 39 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉన్న బోర్లు మరమ్మత్తులు, కొత్త బోర్లు వేయడానికి రూ, 5 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి తెప్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా కొత్త బోర్లు, బోర్లు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa