న్యూఢిల్లీ: ఆధార్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన బయోమెట్రిక్ వివరాలు భద్రంగా ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేసే అవకాశం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండి యా (యూఐడీఏఐ) తెలిపింది. ఆధార్ బయోమెట్రిక్ వివరాలు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన ఆరోపణలపై యూఐడీఏఐ స్పందించింది. గడిచిన ఐదేండ్లలో దాదాపు 400 కోట్ల ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిగాయని ఇప్పటివరకు వివరాలు దొంగిలించడం, ఆర్థిక నేరాలకు పాల్పడటం వంటివి నమోదు కాలేదని, తమ దృష్టికి రాలేదని చెప్పింది. ఇతర వ్యవస్థలతో పోల్చితే ఆధార్ డేటాబేస్ ఎంతో సురక్షితమైనదని, వ్యక్తుల సమాచారాన్ని ఏవిధంగానూ దొంగిలించే అవకాశం లేదని పేర్కొన్నది.
ఓ బ్యాంకు ఉద్యోగి తన సొంత బయోమెట్రిక్ వివరాలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించగా తమ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని, అతడిపై ఆధార్ చట్టం కింద చర్యలు తీసుకున్నామని వివరించింది. సబ్బిడీల పంపిణీకి ఆధార్ అనుసంధానించడం ద్వారా గత రెండున్నరేండ్లలో దేశవ్యాప్తంగా రూ.49 వేల కోట్లు ఆదా అయినట్టు వెల్లడించింది. ఆధార్ వివరాల ఆధారంగా ఇప్పటివరకు 4.47 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారని తెలిపింది. నిత్యావసరాలకు ఆధార్ అనుసంధానించడం ద్వారా అవినీతి భారీగా తగ్గిపోయిందని పేర్కొన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa