కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం రోజు శ్రీవారిని 61,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,399 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.3.59 కోట్ల ఆదాయం వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa