గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ లో భాగంగా ప్రస్తుతం వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నారు. జులై 1 నుండి ఈ పోషకాహారాన్ని ఇంటి వద్దే అందించనున్నారు. ప్రతి నెల 1-5వ తేదీల మధ్య బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఎండు ఖర్జూరం, 16-17 తేదీల్లో రెండో విడతగా పాలు, కోడిగుడ్లు అందజేస్తారు.