విజయవాడ:ఆంధ్రప్రదేశ్ శాసనసభను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరనున్నది. నేడిక్కడ జరిగిన వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో సభను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని కోరాలని తీర్మానించారు. శాసనసభను ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa